సాంకేతిక లోపంతో నిలిచిన దుబాయ్ మెట్రో సేవలు పున:ప్రారంభం
- January 20, 2023
దుబాయ్: సాంకేతిక లోపంతో నిలిచిన దుబాయ్ మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. రెడ్లైన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిన సర్వీసులు యథావిధిగా ప్రారంభమయ్యాయని దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈక్విటీ స్టేషన్, జెబెల్ అలీ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేశామని అథారిటీ తెలిపింది. మెట్రో సర్వీసుల పున:ప్రారంభం పై అధికార యంత్రాంగం ట్వీట్ చేసింది "ఈక్విటీ స్టేషన్, జబల్ అలీ స్టేషన్ మధ్య మెట్రో సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. మీ సహకారానికి ధన్యవాదాలు." అంటూ అథారిటీ తన ట్వీట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









