యూఏఈలో తగ్గిన 90 రోజుల విజిట్ వీసాల జారీ!
- January 21, 2023
యూఏఈ: మూడు-నెలల విజిట్ వీసాల జారీని యూఏఈ కఠినతరం చేసింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 30, 60 రోజుల విజిట్ వీసాలు మాత్రమే జారీ చేయబడుతున్నాయని అల్హింద్ బిజినెస్ సెంటర్ నుండి నౌషాద్ హసన్ చెప్పారు. అవి కూడా Dh400, Dh450 మధ్య ధరలలో అందుబాటులో ఉన్నాయన్నారు. సందర్శకులు తమ వీసాల కోసం సుమారుగా Dh900 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చుతో ఒక నెల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. విస్తృతమైన సంస్కరణల తర్వాత యూఏఈ వీసా విధానాలలో అనేక మార్పులు వచ్చాయి. అయితే, కొన్ని షరతులతో 90 రోజుల వీసాలను ఇప్పటికీ జారీ చేస్తున్నారని స్మార్ట్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ అన్నారు. ఏదైనా వైద్య అవసరాల కోసం దేశానికి వచ్చే వారు వైద్య నివేదికలు, వైద్యుల అపాయింట్మెంట్లు, ఇతర సహాయక డాక్యుమెంటేషన్ను సమర్పిస్తే 90 రోజుల వీసాను పొందుతారని తెలిపారు. అలాగే జాబ్ ఎక్స్ప్లోరేషన్ వీసా 90 రోజులు ఉండాలనుకునే వారికి అందుబాటులో ఉందన్నారు. మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ప్రకారం.. ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాల నుండి తాజా గ్రాడ్యుయేట్లకు 60, 90, 120 రోజుల వీసాలు అందుబాటులో ఉన్నాయని అహ్మద్ వివరించారు. జాబ్ ఎక్స్ప్లోరేషన్ వీసా ఖర్చు, బస వ్యవధి ఆధారంగా ఫీజులు ఉంటాయన్నారు. వీసా ఫీజులో Dh1,025 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్, బీమా ఉన్నాయి. 60 రోజుల వీసా మొత్తం Dh1,495 ఖర్చవుతుందని, 90-రోజుల వీసాలకు Dh1,655, 120-రోజుల అనుమతికి Dh1,815 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అహ్మద్ వివరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









