ధోఫర్ గవర్నరేట్లో మంటలను ఆర్పిన సీడీఏఏ
- January 21, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లోని పొలంలో చెలరేగిన మంటలను ఆర్పినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. "ధోఫర్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సలాలా విలాయత్లోని అవ్కాద్ ప్రాంతంలోని ఒక పొలంలో గడ్డి మంటలను ఆర్పాయి" అని సీడీఏఏ తెలిపింది. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేసింది. గడ్డి మంటలు త్వరగా వ్యాపించగలవని, గడ్డిని వీలయినంత త్వరగా కత్తిరించడమో లేదా పశువులను మేపాలని సూచించింది. మంటలు చెలరేగిన సమయంలో జంతువులను దూరంగా తరలించాలి. అగ్నిమాపక పరికరాలు అన్ని సందర్భాల్లో పనిచేసేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. అగ్నిమాపక వాహనం వచ్చేందుకు సరైన దారిని ఏర్పాటు చేయాలని సీడీఏఏ రైతులకు సూచించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు