ధోఫర్ గవర్నరేట్లో మంటలను ఆర్పిన సీడీఏఏ
- January 21, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లోని పొలంలో చెలరేగిన మంటలను ఆర్పినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. "ధోఫర్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సలాలా విలాయత్లోని అవ్కాద్ ప్రాంతంలోని ఒక పొలంలో గడ్డి మంటలను ఆర్పాయి" అని సీడీఏఏ తెలిపింది. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేసింది. గడ్డి మంటలు త్వరగా వ్యాపించగలవని, గడ్డిని వీలయినంత త్వరగా కత్తిరించడమో లేదా పశువులను మేపాలని సూచించింది. మంటలు చెలరేగిన సమయంలో జంతువులను దూరంగా తరలించాలి. అగ్నిమాపక పరికరాలు అన్ని సందర్భాల్లో పనిచేసేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. అగ్నిమాపక వాహనం వచ్చేందుకు సరైన దారిని ఏర్పాటు చేయాలని సీడీఏఏ రైతులకు సూచించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







