ధోఫర్ గవర్నరేట్లో మంటలను ఆర్పిన సీడీఏఏ
- January 21, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లోని పొలంలో చెలరేగిన మంటలను ఆర్పినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. "ధోఫర్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సలాలా విలాయత్లోని అవ్కాద్ ప్రాంతంలోని ఒక పొలంలో గడ్డి మంటలను ఆర్పాయి" అని సీడీఏఏ తెలిపింది. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేసింది. గడ్డి మంటలు త్వరగా వ్యాపించగలవని, గడ్డిని వీలయినంత త్వరగా కత్తిరించడమో లేదా పశువులను మేపాలని సూచించింది. మంటలు చెలరేగిన సమయంలో జంతువులను దూరంగా తరలించాలి. అగ్నిమాపక పరికరాలు అన్ని సందర్భాల్లో పనిచేసేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. అగ్నిమాపక వాహనం వచ్చేందుకు సరైన దారిని ఏర్పాటు చేయాలని సీడీఏఏ రైతులకు సూచించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









