సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కొత్త రూల్స్..
- January 22, 2023 
            న్యూ ఢిల్లీ: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది.ఆ ఇన్ ఫ్లుయెన్సర్ తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలను వెల్లడించాల్సివుంటుందని లేకపోతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి. అవసరమైతే ఆ వాణిజ్య ఒప్పందాలను బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు నివారించేందుకు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో సెలబ్రేటీలు, ఇన్ ఫ్లుయెన్సర్లు, వర్చువల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు ఎన్ డోన్ మెంట్స్ నో హౌస్ పేరుతో గైడ్ లైన్స్ విడుదల చేసింది.
యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉండే సెలబ్రెటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా లేదా కన్ ఫ్యూజ్ చేసేలా ఆయా ప్రొడక్టులు, సర్వీసులను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా గైడ్ లైన్స్ ప్రవేశపెట్టింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







