జనవరి 26న ఇండియన్ ఎంబసీలో గణతంత్ర దినోత్సవం

- January 24, 2023 , by Maagulf
జనవరి 26న ఇండియన్ ఎంబసీలో గణతంత్ర దినోత్సవం

కువైట్: జనవరి 26వ తేదీన( గురువారం) ఉదయం ఎంబసీ ప్రాంగణంలో 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఉదయం 9:00 గంటలకు జరిగే ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా భారతీయ పౌరులను ఆహ్వానించింది. ఉదయం 9:00 గంటలకు భారత రాయబారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని, అనంతరం భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి విన్పిస్తారని తెలిపింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భారతీయ పౌరులందరు భారత రాయబార కార్యాలయం (https://forms.gle/X4yVo76572WjN7cu5) లింక్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com