దుబాయ్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. 2 కొత్త వంతెనలు ప్రారంభం
- January 24, 2023
దుబాయ్: సిలికాన్ ఒయాసిస్, అకడమిక్ సిటీకి సేవలందించే కొత్త వంతెనలను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రారంభించింది. 120 మీటర్ల పొడవైన రెండు వంతెనలు షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించారు. ఇవి దుబాయ్-అల్ ఐన్ రహదారితో కూడలి నుండి అకడమిక్ సిటీ రౌండ్అబౌట్ వరకు 3 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ప్రతి దిశలో నాలుగు లేన్లను కలిగి ఉన్నాయి. వంతెనలు రెండు దిశలలో గంటకు 14,400 వాహనాలు ప్రయాణించేలా సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కొత్త వంతెనల కారణంగా షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ వెంట ట్రాఫిక్ సాఫీగా సాగనున్నది. దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ నివాసితులు, 25కి పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో చదువుతున్న 27,500 మంది విద్యార్థుల జనాభాతో పాటు చుట్టుపక్కల అభివృద్ధి ప్రాజెక్టులలో పనిచేసే వారికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం కలుగనుంది. వైస్ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టామని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ మత్తర్ అల్ తాయర్ తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







