25 ఎకరాల్లో.... 23 అంతస్థులతో నిర్మాణం
- April 30, 2016
ఏపీ ఎన్నారైలకు శుభవార్త. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల్లో ఉంటూ పాటుపడుతున్న ఎన్నారైల కోసం రాజధానిలో ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 25 ఎకరాల్లో 23 అంతస్థులతో నిర్మించబోయే ఈ భవనం ఇంగ్లీషు లెటర్ ‘A’ ఆకారంలో ఉండనుంది. దీనికోసం సమారు 150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నారై వ్యవహారాల సలహాదారు వేమూరి రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భవనాల పక్కను నిర్మించే ఈ భవనంలో ఓ రెస్టారెంట్, విదేశాల్లోని ఎన్నారైలతో నేరుగా సంభాషించగల ఆడిటోరియం ఉంటాయన్నారు. దీనికోసం ఎన్నారైల నుంచి విరాళాలు సేకరిస్తామని తెలిపారు. ఈ భవనంలో అన్ని ఎన్నారై సంఘాల ప్రాతినిధ్యం ఉండేట్లు కృషి చేస్తామని రవి తెలిపారు
తాజా వార్తలు
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..