నార్వే సమీపంలోని పశ్చిమ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది
- April 30, 2016నార్వే సమీపంలోని పశ్చిమ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 11 మృతదేహాలను వెలికి తీశారు. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. నార్వేకు చెందిన సంస్థ స్టేట్ అయిల్ కంపెనీ లో అయిల్ ను వెలికి తీసిన కార్మికులను మెయిన్ లాండ్ కు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.మృతుల్లో బ్రిటన్ దేశస్థుడు కూడా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంపై బ్రిటన్ విదేశీ కార్యాలయం స్పందించింది. మృతుల్లో మరణించిన బ్రిటన్ వాసి కుటుంబానికి అన్ని విధాల తోడుగా ఉంటామని ఆ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అందుకు గాను స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా