తృణ ధాన్యాలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చా.?
- January 24, 2023
మధుమేహం ఓ దీర్షకాలికమైన వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి ఎటాక్ అయితే, దీనికి శాశ్వత పరిష్కారం లేదు. కేవలం లక్షణాలను మాత్రమే నియంత్రించుకోవడం అవుతుంది. ముఖ్యంగా మధుమేహులు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఏది పడితే అది తినేయడం సరికాదు.
తాము తీసుకునే ఆహారం మీద సంపూర్ణమైన అవగాహనతో వుండాలి. సమతుల్యమైన ఆహారంతో మధుమేహులు సురక్షితంగా జీవనాన్ని గడపొచ్చునని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా తృణ ధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో వుంచుకునే అవకాశం కలుగుతుంది. ఆ క్రమంలోనే తృణధాన్యాలు మధుమేహుల పాలిట వరంగా చెబుతారు.
జొన్నలు
జొన్నలతో చేసిన అన్నం లేదా రొట్టెలు మధుమేహులకు మంచి ఆహారం. జొన్నలు చక్కెర స్థాయిలను అదుపులో వుంచడంతో పాటూ, శరీరానికి కావల్సిన ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి వుంటాయ్.
రాగులు
రాగుల్లో అధిక శాతం ఫైబర్ వుంటుంది. అలాగే, కార్భో హైడ్రేట్లు కూడా పుష్కలంగా వుంటాయ్. దీంతో, జీర్ణక్రియను వేగవంతం చేయడంతో పాటూ, చక్కెర స్థాయిని అదుపులో వుంచేందుకు కూడా ఇవి తోడ్పడతాయ్.
వీటితో పాటే సజ్జలు, ఓట్స్, బార్లీ తదితర తృణ ధాన్యాలు మధుమేహ రోగులకు మంచి ఆహారం.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







