తృణ ధాన్యాలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చా.?
- January 24, 2023
మధుమేహం ఓ దీర్షకాలికమైన వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి ఎటాక్ అయితే, దీనికి శాశ్వత పరిష్కారం లేదు. కేవలం లక్షణాలను మాత్రమే నియంత్రించుకోవడం అవుతుంది. ముఖ్యంగా మధుమేహులు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఏది పడితే అది తినేయడం సరికాదు.
తాము తీసుకునే ఆహారం మీద సంపూర్ణమైన అవగాహనతో వుండాలి. సమతుల్యమైన ఆహారంతో మధుమేహులు సురక్షితంగా జీవనాన్ని గడపొచ్చునని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా తృణ ధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో వుంచుకునే అవకాశం కలుగుతుంది. ఆ క్రమంలోనే తృణధాన్యాలు మధుమేహుల పాలిట వరంగా చెబుతారు.
జొన్నలు
జొన్నలతో చేసిన అన్నం లేదా రొట్టెలు మధుమేహులకు మంచి ఆహారం. జొన్నలు చక్కెర స్థాయిలను అదుపులో వుంచడంతో పాటూ, శరీరానికి కావల్సిన ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి వుంటాయ్.
రాగులు
రాగుల్లో అధిక శాతం ఫైబర్ వుంటుంది. అలాగే, కార్భో హైడ్రేట్లు కూడా పుష్కలంగా వుంటాయ్. దీంతో, జీర్ణక్రియను వేగవంతం చేయడంతో పాటూ, చక్కెర స్థాయిని అదుపులో వుంచేందుకు కూడా ఇవి తోడ్పడతాయ్.
వీటితో పాటే సజ్జలు, ఓట్స్, బార్లీ తదితర తృణ ధాన్యాలు మధుమేహ రోగులకు మంచి ఆహారం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









