తృణ ధాన్యాలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చా.?
- January 24, 2023
మధుమేహం ఓ దీర్షకాలికమైన వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి ఎటాక్ అయితే, దీనికి శాశ్వత పరిష్కారం లేదు. కేవలం లక్షణాలను మాత్రమే నియంత్రించుకోవడం అవుతుంది. ముఖ్యంగా మధుమేహులు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఏది పడితే అది తినేయడం సరికాదు.
తాము తీసుకునే ఆహారం మీద సంపూర్ణమైన అవగాహనతో వుండాలి. సమతుల్యమైన ఆహారంతో మధుమేహులు సురక్షితంగా జీవనాన్ని గడపొచ్చునని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా తృణ ధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో వుంచుకునే అవకాశం కలుగుతుంది. ఆ క్రమంలోనే తృణధాన్యాలు మధుమేహుల పాలిట వరంగా చెబుతారు.
జొన్నలు
జొన్నలతో చేసిన అన్నం లేదా రొట్టెలు మధుమేహులకు మంచి ఆహారం. జొన్నలు చక్కెర స్థాయిలను అదుపులో వుంచడంతో పాటూ, శరీరానికి కావల్సిన ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి వుంటాయ్.
రాగులు
రాగుల్లో అధిక శాతం ఫైబర్ వుంటుంది. అలాగే, కార్భో హైడ్రేట్లు కూడా పుష్కలంగా వుంటాయ్. దీంతో, జీర్ణక్రియను వేగవంతం చేయడంతో పాటూ, చక్కెర స్థాయిని అదుపులో వుంచేందుకు కూడా ఇవి తోడ్పడతాయ్.
వీటితో పాటే సజ్జలు, ఓట్స్, బార్లీ తదితర తృణ ధాన్యాలు మధుమేహ రోగులకు మంచి ఆహారం.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







