భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు..

- January 27, 2023 , by Maagulf
భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు..

అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌పై భారీగా పడింది. దీనికి ప్రతికూల పరిస్థితులుకూడా తోడుకావటంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. శుక్రవారం అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు ముదుపర్లను నష్టాల్లో ముంచెత్తాయి. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలోఉన్న గౌతమ్ అధానీ దిగువకు పడిపోయారు. గత రెండురోజుల పరిణామాల నేపథ్యంలో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంకు పడిపోయిన అదానీ.. శుక్రవారం ఒక్కసారిగా ఏడో స్థానానికి పడిపోయాడు.

2022 సంవత్సరంలో జెట్‌స్పీడ్‌తో దూసుకుపోయిన అదానీ ఆదాయం.. 2023 సంవత్సరంలో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి.ఈ నెలలో మొన్నటి వరకు బాగానేఉన్నప్పటికీ.. అమెరికన్ పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక వచ్చిన తరువాత అదానీ గ్రూప్ షేర్ భారీ నష్టాలను చవిచూశాయి. కేవలం రెండు రోజుల్లోనే మార్కెట్ క్యాప్ రూ. 2.37లక్షల కోట్లు తగ్గింది. దీని కారణంగా గౌతమ్ అదానీ నికర విలువ రూ. 100.4 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ఏడవ ర్యాంకుకు పడిపోయాడు.

అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికే అదానీ గ్రూప్ షేర్లు విలువ అమాంతం తగ్గిపోవటానికి కారణమైంది. అయితే, ఈ నివేదికను అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ శుక్రవారం సైతం ఆ గ్రూప్ షేర్లు మదుపర్లను నష్టాల్లో ముంచెత్తాయి. అయితే హిండెన్‌బర్గ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకొనేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com