ఇజ్రాయెల్ లో కాల్పులు.. ఏడుగురు మృతి
- January 28, 2023
జెరూసలెం: ఇజ్రాయెల్ లో కాల్పులు కలకలం రేపాయి. జెరూసలెంలోని ప్రార్థనామందిరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జెరూసలెంలోని ఓ ప్రార్థనామందిరంలో సబ్బత్ వేడుకల్లో పాల్గొన్న పౌరులపై పాలస్తీనాకు చెందిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇజ్రాయెల్ దళాలు దుండగుడిని కాల్చి చంపారు. అంతకముందు వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తియన్ శరణార్థుల శిబిరంపై దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైన్యం 9 మందిని కాల్చి చంపింది. అందుకు ప్రతీకారంగా దుందగుడు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇజ్రాయెల్ లో జరిగిన కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు.
మార్చి 30, 2022న ఇజ్రాయిల్ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెల్ అవివ్ శివారులోని బినెయి బ్రాక్ ప్రాంతంలో ఓ దుండగుడు తుపాకి పట్టుకుని వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అల్ట్రా-ఆర్థోడాక్స్ యూదు ప్రాంతాలలో ఒకటైన బినెయి బ్రాక్ ప్రాంతంలో యూదులు అధిక సంఖ్యలో ఉంటారు. ఈ ప్రాంతంలో దుండుగుడు తుపాకితో కాల్పులు జరుపగా ఐదుగురు చనిపోయాడు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. ఇజ్రాయెల్ మీడియా నివేదికలు ప్రకారం..దాడి చేసిన వ్యక్తి 27 ఏళ్ల పాలస్తీనియన్ అని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్కు ఉత్తరాన ఉన్న గ్రామానికి చెందినవాడు అని వెల్లడించింది.
గతంలో ఇజ్రాయెల్ అరబ్బులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. ఈ దాడులతో సెక్యూర్టీ దళాలు హై అలర్ట్లో ఉన్నాయి. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. నల్ల దుస్తులు ధరించి, చేతిలో అటోమెటిక్ వెపన్తో ఉన్న వాహనంపై వచ్చిన ఆ దుండగుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపాడు. ఒకరు వాహనంలో చనిపోగా, మరికొంత మంది వీధుల్లో చెల్లాచెదురుగా పడి మృతి చెందారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







