జార్ఖండ్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి
- January 28, 2023
ధన్బాద్: జార్ఖండ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ధన్బాద్లోని పురానా బజర్ లోని ఓ హాస్పిటల్ లో జరిగిన ఈ ప్రమాదంలో డాక్టర్ దంపతులతో సహా ఐదురుగు మృతి చెందారు. శుక్రవారం (జనవరి 17,2023) రాత్రి హజ్రా హాస్పిటల్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు డాక్టర్ వికాస్ హజ్రా, అతని భార్య ప్రేమ హజ్రాతో పాటు మరికొందరు ఉద్యోగులు మరణించారు. మంటలు చెలరేగాక ఆర్పేయత్నం జరగకపోవటం..దట్టమైన పొగ అలుముకోవటంతో అందరూ ఊపిరి ఆడక మరణించినట్లుగా గుర్తించారు.
హాస్పిటల్ మొదటి అంతస్థులోని స్టోర్ రూమ్లో చెలరేగిన మంటలు క్రమంగా ఆస్పత్రి మొత్తం వ్యాపించాయి. ఈ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండడంతో జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. ఈ అగ్నిప్రమాదంలో మొదటి అంతస్తులో నివాసం హాస్పిటల్ యజమానులు మేనేజర్ డాక్టర్ ప్రేమా హజ్రా, ఆమె భర్త డాక్టర్ వికాస్ హజ్రాతో పాటు వారి పనిమనిషి..మరో ముగ్గురు మృతి చెందారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో సహా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సహాయక చర్యల్ని చేపట్టారు. రోగులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు కానీ దాదాపు తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని సమీపంలోని పాటలీపుత్ర నర్శింగ్ హోమ్ కు తరలించి చికిత్సనందిస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ లో ప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పటానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని అందుకే ఐదుగురు చనిపోవటంతో పలువురు గాయపడటం జరిగిందని తెలిపారు. హాస్పిటల్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి డాక్టర్ దంపతులతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







