కువైట్లో ప్రయాణ, పర్యాటక ఆదాయంలో 338 శాతం పెరుగుదల
- January 30, 2023
కువైట్: కువైట్లో ట్రావెల్ అండ్ టూరిజం రంగం 2022 సంవత్సరంలో దాదాపు 75 శాతం వ్యాపారం పెరిగింది. కువైట్లోని ట్రావెల్, టూరిజం కార్యాలయాల ఆదాయం గత సంవత్సరంలో 338 శాతం పెరిగి 276.7 మిలియన్ దినార్లకు చేరుకుంది. అంతకుముందు 2020లో కరోనా సంక్షోభం సంభవించినప్పుడు 63.22 మిలియన్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే, ఇది కరోనా సంక్షోభం కంటే ముందు 2019లో 308.18 మిలియన్ దినార్ల కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం. పౌరులు, నివాసితులు దీర్ఘకాల అంతరాయం తర్వాత ప్రయాణించడానికి ఆసక్తిని చూపడంతో ఈ రంగానికి ఆదాయం పెరగడానికి కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే జాతీయ సెలవు దినాలలో టర్కీ, దుబాయ్, కైరో ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







