కువైట్లో ప్రయాణ, పర్యాటక ఆదాయంలో 338 శాతం పెరుగుదల
- January 30, 2023
కువైట్: కువైట్లో ట్రావెల్ అండ్ టూరిజం రంగం 2022 సంవత్సరంలో దాదాపు 75 శాతం వ్యాపారం పెరిగింది. కువైట్లోని ట్రావెల్, టూరిజం కార్యాలయాల ఆదాయం గత సంవత్సరంలో 338 శాతం పెరిగి 276.7 మిలియన్ దినార్లకు చేరుకుంది. అంతకుముందు 2020లో కరోనా సంక్షోభం సంభవించినప్పుడు 63.22 మిలియన్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే, ఇది కరోనా సంక్షోభం కంటే ముందు 2019లో 308.18 మిలియన్ దినార్ల కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం. పౌరులు, నివాసితులు దీర్ఘకాల అంతరాయం తర్వాత ప్రయాణించడానికి ఆసక్తిని చూపడంతో ఈ రంగానికి ఆదాయం పెరగడానికి కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే జాతీయ సెలవు దినాలలో టర్కీ, దుబాయ్, కైరో ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







