సౌదీ అరేబియాలో 6.8 శాతానికి తగ్గిన ప్రమాదాలు
- January 30, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ప్రధాన ప్రమాదాలు 6.8% తగ్గాయని ట్రాఫిక్ భద్రత మంత్రిత్వ కమిటీ ప్రకటించింది. 2022లో 17 వేల ప్రమాదాలు మాత్రమే నమోదు కాగా.. 2021లో 18 వేల ప్రమాదాలు నమోదయ్యాయి. 2022 సంవత్సరానికి సంబంధించిన ట్రాఫిక్ సేఫ్టీ ఫైల్ ఫలితాలను ఇన్ఫోగ్రాఫిక్లో కమిటీ వెల్లడించింది. కారు ప్రమాదాల వల్ల సంభవించే మరణాల శాతం 2.1% తగ్గింది. 2021లో 4.6 వేలుగా ఉన్నా మరణాలు.. 2022లో 4.5 వేలకు తగ్గాయి. అదే సమయంలో ప్రమాదాల తరువాత దెబ్బతిన్న వాహనాల సంఖ్య 28% పెరిగింది. 2022లో కారు ప్రమాదాల వల్ల గాయపడ్డ వారి సంఖ్య 2.7% తగ్గింది. 2021తో 25 వేల మందికి గాయాలు కాగా, 2022లో 24 వేల మందికి గాయాలు అయినట్లు కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







