మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించిన హిస్ హైనెస్ అల్ నహ్యాన్
- February 01, 2023
దుబాయ్: జనవరి 31, 2023న దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో మహాత్మా గాంధీ ప్రతిమను యూఏఈ సహనం, సహజీవన(Tolerance and Coexistence) మంత్రి హిస్ హైనెస్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఆవిష్కరించారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, దుబాయ్-నార్తర్న్ ఎమిరేట్స్లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి హిస్ హైనెస్ షేక్ నహ్యాన్తో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీకి ఇష్టమైన 'వైష్ణవ్ జన్ తో', 'రఘుపతి రాఘవ' భజనలను సోమదుత్తా బసు ఆలపించారు. 42 అంగుళాలు మహాత్మా గాంధీ ప్రతిమను నరేష్ కుమావత్ రూపొందించారు. ఈ ప్రతిమను న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) వారు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్లొమాటిక్ కమ్యూనిటీ సభ్యులు, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలు, దుబాయ్ - నార్తర్న్ ఎమిరేట్స్లోని ఇండియన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







