మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించిన హిస్ హైనెస్ అల్ నహ్యాన్
- February 01, 2023
దుబాయ్: జనవరి 31, 2023న దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో మహాత్మా గాంధీ ప్రతిమను యూఏఈ సహనం, సహజీవన(Tolerance and Coexistence) మంత్రి హిస్ హైనెస్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఆవిష్కరించారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, దుబాయ్-నార్తర్న్ ఎమిరేట్స్లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి హిస్ హైనెస్ షేక్ నహ్యాన్తో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీకి ఇష్టమైన 'వైష్ణవ్ జన్ తో', 'రఘుపతి రాఘవ' భజనలను సోమదుత్తా బసు ఆలపించారు. 42 అంగుళాలు మహాత్మా గాంధీ ప్రతిమను నరేష్ కుమావత్ రూపొందించారు. ఈ ప్రతిమను న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) వారు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్లొమాటిక్ కమ్యూనిటీ సభ్యులు, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలు, దుబాయ్ - నార్తర్న్ ఎమిరేట్స్లోని ఇండియన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..