మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించిన హిస్ హైనెస్ అల్ నహ్యాన్
- February 01, 2023
దుబాయ్: జనవరి 31, 2023న దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో మహాత్మా గాంధీ ప్రతిమను యూఏఈ సహనం, సహజీవన(Tolerance and Coexistence) మంత్రి హిస్ హైనెస్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఆవిష్కరించారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, దుబాయ్-నార్తర్న్ ఎమిరేట్స్లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి హిస్ హైనెస్ షేక్ నహ్యాన్తో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీకి ఇష్టమైన 'వైష్ణవ్ జన్ తో', 'రఘుపతి రాఘవ' భజనలను సోమదుత్తా బసు ఆలపించారు. 42 అంగుళాలు మహాత్మా గాంధీ ప్రతిమను నరేష్ కుమావత్ రూపొందించారు. ఈ ప్రతిమను న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) వారు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్లొమాటిక్ కమ్యూనిటీ సభ్యులు, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలు, దుబాయ్ - నార్తర్న్ ఎమిరేట్స్లోని ఇండియన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







