విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు క్షమాపణలు తెలిపిన సమంత
- February 01, 2023
విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివనిర్వాణ డైరెక్షన్లో ఖుషి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి మూవీ లో జోడి కట్టిన సామ్ – విజయ్ మరోసారి ఈ మూవీ తో కనువిందు చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన కొద్దీ రోజులకే సామ్ అనారోగ్యం పాలవ్వడం తో షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం సమంత కోలుకోవడం తో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ ఓ అభిమాని ట్విట్టర్ లో సమంత ను ప్రశ్నించగా.. దానికి సమాధానం ఇచ్చింది. త్వరలోనే మొదలవుతుందని చెబుతూ, విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు (సినిమా ఇంతకాలం నిలిచిపోయినందుకు) అంటూ ట్వీట్ చేసింది. దీనికి అభిమానులు స్పందిస్తూ ముందు ఆరోగ్యం జాగ్రత్త అంటూ సలహాలు ఇస్తున్నారు.
ఇక సమంత నటించిన శాకుంతలం మూవీ ఈ నెల 17 న పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ , ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ & దిల్ రాజు లు నిర్మించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







