విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు క్షమాపణలు తెలిపిన సమంత
- February 01, 2023
విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివనిర్వాణ డైరెక్షన్లో ఖుషి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి మూవీ లో జోడి కట్టిన సామ్ – విజయ్ మరోసారి ఈ మూవీ తో కనువిందు చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన కొద్దీ రోజులకే సామ్ అనారోగ్యం పాలవ్వడం తో షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం సమంత కోలుకోవడం తో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ ఓ అభిమాని ట్విట్టర్ లో సమంత ను ప్రశ్నించగా.. దానికి సమాధానం ఇచ్చింది. త్వరలోనే మొదలవుతుందని చెబుతూ, విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు (సినిమా ఇంతకాలం నిలిచిపోయినందుకు) అంటూ ట్వీట్ చేసింది. దీనికి అభిమానులు స్పందిస్తూ ముందు ఆరోగ్యం జాగ్రత్త అంటూ సలహాలు ఇస్తున్నారు.
ఇక సమంత నటించిన శాకుంతలం మూవీ ఈ నెల 17 న పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ , ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ & దిల్ రాజు లు నిర్మించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







