నకిలీ ఇన్వాయిస్లతో కార్యాలయం నుంచి Dh431,000 చోరీ
- February 05, 2023
యూఏఈ: పనిచేసిన కంపెనీ నుండి 431,932 దిర్హామ్లను దొంగిలించడానికి నకిలీ ఇన్వాయిస్లను ఉపయోగించిన ఉద్యోగిని దోషిగా కోర్టు తేల్చింది. అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆ వ్యక్తి తన మాజీ యజమాని నుండి అపహరించిన నగదును తిరిగి చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. కంపెనీ అకౌంట్స్ విభాగంలో పనిచేసే తన మాజీ ఉద్యోగి నకిలీ ఇన్ వాయిస్ లను ఉపయోగించి నిధులను కాజేసిండని కంపెనీ దావా వేసింది. కాజేసిన 431,932 దిర్హామ్లతోపాటు నష్టపరిహారం కింద 120,000 దిర్హాములను ఇప్పించాలని కంపెనీ తన దావాలో డిమాండ్ చేసింది. అబుదాబి క్రిమినల్ కోర్ట్ అంతకుముందు సదరు ఉద్యోగిని దోషిగా నిర్ధారించి, అపరాధ రుసుముతో శిక్ష విధించింది. కంపెనీకి జరిగిన నష్టాలకు తాత్కాలిక పరిహారంగా 51,000 దిర్హామ్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. కేసును పరిశీలించిన సివిల్ కోర్టు న్యాయమూర్తి ఆ వ్యక్తి కంపెనీ నుండి దొంగిలించిన 431,932 దిర్హామ్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కంపెనీ చట్టపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









