నకిలీ ఇన్వాయిస్లతో కార్యాలయం నుంచి Dh431,000 చోరీ
- February 05, 2023
యూఏఈ: పనిచేసిన కంపెనీ నుండి 431,932 దిర్హామ్లను దొంగిలించడానికి నకిలీ ఇన్వాయిస్లను ఉపయోగించిన ఉద్యోగిని దోషిగా కోర్టు తేల్చింది. అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆ వ్యక్తి తన మాజీ యజమాని నుండి అపహరించిన నగదును తిరిగి చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. కంపెనీ అకౌంట్స్ విభాగంలో పనిచేసే తన మాజీ ఉద్యోగి నకిలీ ఇన్ వాయిస్ లను ఉపయోగించి నిధులను కాజేసిండని కంపెనీ దావా వేసింది. కాజేసిన 431,932 దిర్హామ్లతోపాటు నష్టపరిహారం కింద 120,000 దిర్హాములను ఇప్పించాలని కంపెనీ తన దావాలో డిమాండ్ చేసింది. అబుదాబి క్రిమినల్ కోర్ట్ అంతకుముందు సదరు ఉద్యోగిని దోషిగా నిర్ధారించి, అపరాధ రుసుముతో శిక్ష విధించింది. కంపెనీకి జరిగిన నష్టాలకు తాత్కాలిక పరిహారంగా 51,000 దిర్హామ్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. కేసును పరిశీలించిన సివిల్ కోర్టు న్యాయమూర్తి ఆ వ్యక్తి కంపెనీ నుండి దొంగిలించిన 431,932 దిర్హామ్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కంపెనీ చట్టపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







