హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం..
- February 05, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లి రంగనాముని చెరువు సమీపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారితో పాటు కొనుగోలు చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల నుంచి లక్ష రూపాయలు విలువైన 18గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ తెలిపారు.
హైదరాబాద్లో తరుచుగా డ్రగ్స్ గుప్పుమనడం కలకలం రేపుతోంది. మాదకద్రవ్యాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో రకంగా మాదకద్రవ్యాలను నగరానికి తీసుకొస్తున్నారు. యువత టార్గెట్ గా డ్రగ్స్ సప్లయ్ జరుగుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం సైలెంట్గా దందా కానిస్తున్నారు.
పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. హైదరాబాద్ కు భారీగా మత్తు పదార్ధాలు స్మగ్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలో పోలీసులు నిఘా మరింత పెంచారు. పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ ముఠాల భరతం పడుతున్నారు. డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేసి కేటుగాళ్లను జైలుకి పంపుతున్నారు. నిన్నమొన్నటి వరకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు తెప్పించిన ముఠాలు ఇప్పుడు రూట్ మార్చి హైదరాబాద్ నుంచే విదేశాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతున్నాయి. ఎంత కట్టడి చేస్తున్నా డ్రగ్స్ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళనకు గురి చేసే అంశం. రోజుల వ్యవధిలో కోట్లాది రూపాయల డ్రగ్స్ ను సీజ్ చేశారంటే.. మత్తు పదార్ధాల మాఫియా ఎంతగా బరి తెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు రూపుమాపేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు. అయినా గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ అక్రమంగా హైదరాబాద్కు తరలించి సప్లయ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







