చైతూకి హ్యాండిచ్చి రౌడీకి ఫిక్సయిపోయిన పరశురామ్.!
- February 06, 2023
‘సోలో’, ‘గీత గోవిందం’ తదితర చిత్రాలతో డైరెక్టర్గా మంచి ఫేమ్ దక్కించుకున్న పరశురామ్, తాజాగా రౌడీతో తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. గతంలో ‘గీత గోవిందం’తో సూపర్ డూపర్ హిట్ కొట్టింది ఈ కాంబో.
ప్రస్తుతం ‘లైగర్’ ఫ్లాప్తో సైలెంట్ అయిపోయిన విజయ్ దేవరకొండకు పరశురామ్ ప్రాజెక్ట్ బూస్టప్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘గీత గోవిందం 2’ అవుతుందని అంచనాలేసేస్తున్నారు.
కాగా, ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ అద్దాలని ఫ్యాన్స్ కోరుతున్నారట. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాని ఈ ప్రాజెక్ట్లో రష్మికా మండన్నాని భాగం చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ అదే జరిగితే, ఫ్యాన్స్ కోరుకున్నట్లే ఇది మరో ‘గీత గోవిందం’ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగోలా హిట్ కొట్టాలన్న కసితో వున్న రౌడీ కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తన లక్కీ ఛామ్ రష్మికతో ముచ్చటగా మూడోసారి స్ర్కీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధంగానే వున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ఈ సేమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందేమో.!
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









