చైతూకి హ్యాండిచ్చి రౌడీకి ఫిక్సయిపోయిన పరశురామ్.!
- February 06, 2023‘సోలో’, ‘గీత గోవిందం’ తదితర చిత్రాలతో డైరెక్టర్గా మంచి ఫేమ్ దక్కించుకున్న పరశురామ్, తాజాగా రౌడీతో తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. గతంలో ‘గీత గోవిందం’తో సూపర్ డూపర్ హిట్ కొట్టింది ఈ కాంబో.
ప్రస్తుతం ‘లైగర్’ ఫ్లాప్తో సైలెంట్ అయిపోయిన విజయ్ దేవరకొండకు పరశురామ్ ప్రాజెక్ట్ బూస్టప్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘గీత గోవిందం 2’ అవుతుందని అంచనాలేసేస్తున్నారు.
కాగా, ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ అద్దాలని ఫ్యాన్స్ కోరుతున్నారట. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాని ఈ ప్రాజెక్ట్లో రష్మికా మండన్నాని భాగం చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ అదే జరిగితే, ఫ్యాన్స్ కోరుకున్నట్లే ఇది మరో ‘గీత గోవిందం’ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగోలా హిట్ కొట్టాలన్న కసితో వున్న రౌడీ కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తన లక్కీ ఛామ్ రష్మికతో ముచ్చటగా మూడోసారి స్ర్కీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధంగానే వున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ఈ సేమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందేమో.!
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్