12,000 రెసిడెన్షియల్ యూనిట్స్పై బార్వా గ్రూప్ దృష్టి
- May 01, 2016
బార్వా రియల్ ఎస్టేట్ గ్రూప్, అందరికీ అందుబాటులో ఉండే అద్దెలతో అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. ఈ సంస్థ 2020 నాటికి 12,000 రెసిడెన్షియల్ యూనిట్స్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నట్లు సంస్థ ఛైర్మన్ సల్మాన్ మొహమ్మద్ అల్ మహాన్నది చెప్పారు. ప్రస్తుతం 4,000 రెసిడెన్షియల్ యూనిట్స్ని కలిగి ఉన్న బార్వా, దీన్ని విస్తరించాలని అనుకుంటోంది. 2016 - 2020 నాటికి 15 బిలియన్ ఖతారీ రియాల్స్తో ఈ విస్తరణను చేపట్టనుంది. తమ ప్రాజెక్టుల్లో చాలావరకు రెసిడెన్షియల్ కోణంలోనే ఉంటాయనీ, హై మరియు మిడ్ సిగ్మెంట్స్లో ప్రాజెక్టులు ఎక్కువగా చేపడ్తామని సంస్థ ప్రతినిథులు వివరించారు. బార్వ విలేజ్ మరియు బార్వా దోహాలలో విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. బార్వా దోహా ప్రాజెక్ట్లో 1,970 అపార్ట్మెంట్లను 2018 నాటికి పూర్తి చేస్తారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో అపార్ట్మెంట్లను నిర్మించడం తమ ప్రత్యేకత అని సల్మాన్ మొహమ్మద్ వివరించారు. కమర్షియల్ మరియు రిటైల్ రంగంలో ఛాలెంజింగ్ పరిస్థితులు ఉన్న దృష్ట్యా, అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







