ఆన్లైన్ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ గుట్టురట్టు
- February 07, 2023
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ కి పాల్పడుతున్న ముఠాల గుట్టురట్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను అడిషనల్ సీపీ గజరాజ్ భూపాల్ మీడియాకు తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తప్పనిసరిగా టోఫెల్ ఎగ్జామ్ తప్పనిసరి. ఆన్లైన్లో జరుగుతున్న ఎగ్జామ్ ని కొందరు కేటుగాళ్లు కాపీ చేశారు.
పెద్ద ఎత్తున మాస్ కాపీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు హైదరాబాద్ కేంద్రంగా నడుపుతున్న ఆన్లైన్ టోల్ మాస్ కాపీయింగ్ లో రెండు గ్యాంగులకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మరోవైపు, కొందరు విద్యార్థుల ఫీజు చెల్లింపుల్లో గోల్మాల్ అయినట్లు తెలుస్తోంది. అమెరికాలో క్రెడిట్ కార్డ్ స్కాం వెలుగులోకి రావడంతో ఇక్కడా పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇప్పటికే మోసపోయిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హైదరాబాద్, కరీంనగర్ కు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఠా దాదాపు రూ.కోటిన్నరకు పైగా మోసానికి పాల్పడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







