ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!

- December 28, 2025 , by Maagulf
ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!

యూఏఈ: రాబోయే నాలుగు రోజులపాటు పీక్ సీజన్ ఉంటుందని షార్జా ఎయిర్ పోర్ట్ అలెర్ట్ జారీ చేసింది. ప్రయాణికులు తమ షెడ్యూల్ కంటే మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో  ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉంటుందని, ప్రయాణీకులు చెక్-ఇన్ సర్వీస్ నుండి ప్రయోజనం పొందాలని విమానాశ్రాయ అధికారులు సూచించారు.    రాబోయే రోజుల్లో షార్జా మరియు ఇతర ఎమిరేట్స్‌లోని విమానాశ్రయాలు అధిక సంఖ్యలో ప్రయాణీకుల రద్దీని ఎదుర్కొంటాయని తెలిపారు.

దాదాపు 10 మిలియన్లకు పైగా ప్రయాణికులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) ద్వారా ప్రయాణించే అవకాశం ఉన్నదని, ప్రయాణికులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక అడ్వైజరీ జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com