రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- December 29, 2025
రియాద్: రియాద్లోని వివిధ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులను రియాద్ ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ ప్రారంభించారు. అల్-హుక్మ్ ప్యాలెస్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రియాద్ మేయర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ కొత్త పార్కులు జీవన నాణ్యత, పట్టణ రూపురేఖలను మెరుగుపరచడానికి మరియు రియాద్ నివాసితులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి దోహదపడే ఒక విలువైన అదనపు సంపద అని ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ అన్నారు.
మొత్తం 274,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కొత్త పార్కులలో 77,300 చదరపు మీటర్ల గ్రీనరీ, 2,480 చెట్లు, 33,500 లీనియర్ మీటర్ల పాదచారుల నడక మార్గాలు మరియు 7,400 లీనియర్ మీటర్ల సైకిల్ మార్గాలు ఉన్నాయి. ఇక 17 క్రీడా మైదానాలు, 913 పార్కింగ్ స్థలాలు మరియు 12,000 చదరపు మీటర్ల పిల్లల ఆట స్థలాలు ఉన్నాయని వివరించారు. రియాద్ నగరంలో 2022లో 17 పార్కులు, 2023లో 45 పార్కులు, 2024లో 25 పార్కులను ప్రారంభించగా.. తాజాగా మరో 25 కొత్త పార్కులను ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









