ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- December 29, 2025
దోహా: ప్రజా భద్రతను పెంపొందించడానికి, అదే సమయంలో ముందస్తుగా ప్రమాదాలను నివారించడానికి ఖతార్ ఇంటిరియర్ మినిస్ట్రీ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సీజన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. మూసిఉన్న గది లేదా సరిగా వెంటిలేషన్ లేని ప్రదేశాలలో మంటలు లేదా బొగ్గును ఉపయోగించకుండా ఉండాలని నివాసితులను కోరింది. వీటిని ఇంటి లోపల ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య మరియు భద్రతా ప్రమాదాలు సంభవిస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అత్యంత విషపూరిత వాయువు కార్బన్ మోనాక్సైడ్ తీవ్ర అనర్థాలకు కారణం అవుతుందని తెలిపింది.
క్లోజ్డ్ గదులు, టెంట్లు, కారవాన్లు మరియు పరిమిత వెంటిలేషన్ ఉన్న మజ్లిస్ ప్రాంతాలు వంటి మూసివున్న ప్రదేశాలలో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తన సోషల్ మీడియాలో అకౌంట్లో పేర్కొంది. ఇంటి లోపల ఫైర్ లేదా బొగ్గు వాడకాన్ని నివారించడం వల్ల ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు మరియు విష వాయువుల వంటి సంఘటనలను గణనీయంగా తగ్గించవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









