ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- December 29, 2025
దోహా: ప్రజా భద్రతను పెంపొందించడానికి, అదే సమయంలో ముందస్తుగా ప్రమాదాలను నివారించడానికి ఖతార్ ఇంటిరియర్ మినిస్ట్రీ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సీజన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. మూసిఉన్న గది లేదా సరిగా వెంటిలేషన్ లేని ప్రదేశాలలో మంటలు లేదా బొగ్గును ఉపయోగించకుండా ఉండాలని నివాసితులను కోరింది. వీటిని ఇంటి లోపల ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య మరియు భద్రతా ప్రమాదాలు సంభవిస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అత్యంత విషపూరిత వాయువు కార్బన్ మోనాక్సైడ్ తీవ్ర అనర్థాలకు కారణం అవుతుందని తెలిపింది.
క్లోజ్డ్ గదులు, టెంట్లు, కారవాన్లు మరియు పరిమిత వెంటిలేషన్ ఉన్న మజ్లిస్ ప్రాంతాలు వంటి మూసివున్న ప్రదేశాలలో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తన సోషల్ మీడియాలో అకౌంట్లో పేర్కొంది. ఇంటి లోపల ఫైర్ లేదా బొగ్గు వాడకాన్ని నివారించడం వల్ల ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు మరియు విష వాయువుల వంటి సంఘటనలను గణనీయంగా తగ్గించవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







