సిరియా, టర్కీలకు $100-మిలియన్ల సహాయ నిధిని ప్రకటించిన యూఏఈ
- February 08, 2023
యూఏఈ: భూకంపాల వల్ల కకావికలమైన సిరియన్ అరబ్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ టర్కీలకు యూఏఈ అండగా నిలబడింది. భూకంపాల వల్ల నష్టపోయిన వారి సహాయానికి $100 మిలియన్లను అందించాలని ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. ఇందులో సిరియన్ ప్రజలకు $50 మిలియన్లు, టర్కిష్ ప్రజలకు $50 మిలియన్లు అందించనున్నారు. ఈ అంతర్జాతీయ చొరవ యూఏఈ మనవతా ప్రయత్నాలను, స్నేహపూర్వక సమాజాలకు సహాయ హస్తాన్ని ప్రతిబింబిస్తోందని యూఏఈ ప్రభుత్వం ఒక ప్రకటలలో తెలిపింది. యూఏఈ అధ్యక్షుడి ఆదేశానుసారం.. టర్కీలో భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయడానికి ఇప్పటికే యూఏఈకి చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లు పనిచేస్తున్నాయి. అలాగే భూకంప బాధితుల సహాయార్థం ఫీల్డ్ హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా సిరియా, టర్కీ ప్రజలకు సహాయం అందించడానికి "గాలంట్ నైట్ / 2" ఆపరేషన్ను ప్రారంభించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ ప్రకటించింది. ఈ ఆపరేషన్లో సాయుధ దళాల భాగస్వామ్యం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్, ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ లు సంయుక్తంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







