సిరియా, టర్కీలకు $100-మిలియన్ల సహాయ నిధిని ప్రకటించిన యూఏఈ
- February 08, 2023
యూఏఈ: భూకంపాల వల్ల కకావికలమైన సిరియన్ అరబ్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ టర్కీలకు యూఏఈ అండగా నిలబడింది. భూకంపాల వల్ల నష్టపోయిన వారి సహాయానికి $100 మిలియన్లను అందించాలని ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. ఇందులో సిరియన్ ప్రజలకు $50 మిలియన్లు, టర్కిష్ ప్రజలకు $50 మిలియన్లు అందించనున్నారు. ఈ అంతర్జాతీయ చొరవ యూఏఈ మనవతా ప్రయత్నాలను, స్నేహపూర్వక సమాజాలకు సహాయ హస్తాన్ని ప్రతిబింబిస్తోందని యూఏఈ ప్రభుత్వం ఒక ప్రకటలలో తెలిపింది. యూఏఈ అధ్యక్షుడి ఆదేశానుసారం.. టర్కీలో భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయడానికి ఇప్పటికే యూఏఈకి చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లు పనిచేస్తున్నాయి. అలాగే భూకంప బాధితుల సహాయార్థం ఫీల్డ్ హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా సిరియా, టర్కీ ప్రజలకు సహాయం అందించడానికి "గాలంట్ నైట్ / 2" ఆపరేషన్ను ప్రారంభించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ ప్రకటించింది. ఈ ఆపరేషన్లో సాయుధ దళాల భాగస్వామ్యం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్, ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ లు సంయుక్తంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు