ఏపీ రాజధాని అమరావతే.. తేల్చి చెప్పిన కేంద్రం
- February 08, 2023
అమరావతి: అమరావతి, మూడు రాజధానుల కేసులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతినే అఫిడవిట్ లో పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్ 5,6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసింది.అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని, 2015 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది.
విభజన చట్టంలోని 94 ప్రకారం రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చామని కేంద్రం తెలిపింది.నిపుణుల కమిటీ సిఫారసులు, సీఆర్డీఏ చట్టంతో కూడిన జీవో కాపీలను సుప్రీంకోర్టు కౌంటర్ అఫిడవిట్ లో జత చేసింది కేంద్రం.మూడు రాజధానుల కేసుపై ఈ నెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
”రాష్ట్ర విజభన చట్టం ప్రకారమే రాజధాని అమరావతి ఏర్పాటైంది.ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటు జరిగింది.అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23నే నోటిఫై చేసింది.
విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారమే నిపుణుల కమిటీ వేసింది.నిపుణుల కమిటీ సూచనలతో అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్తో పాటు ముఖ్యమైన పట్టణ మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వాల్సి ఉంది. కొత్త రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు మంజూరు చేశాం.
2020లో రాష్ట్ర ప్రభుత్వం 2 కొత్త చట్టాలు తీసుకొచ్చింది. సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల ప్రతిపాదనతో చట్టాలు చేసింది. ఈ రెండు చట్టాలు తీసుకొచ్చే ముందు కేంద్రంతో రాష్ట్రం సంప్రదింపులు జరపలేదు. ఇంతకుమించి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు” అని సుప్రీంకోర్టులో జారీ చేసిన కౌంటర్ అఫిడవిట్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది.
నిపుణుల కమిటీ సిఫారసులు, సెక్షన్ 5, 6, 94కు సంబంధించిన డాక్యుమెంట్లు, 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ సీఆర్డీఏ చట్టంతో కూడిన జీవో 97 కాపీలను అఫిడవిట్ లో జత చేసింన కేంద్రం. ఈ నెల 23న మూడు రాజధానుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







