పౌరసత్వాన్ని వదులుకున్న 16 లక్షల మంది భారతీయులు...
- February 09, 2023
న్యూ ఢిల్లీ: గడిచిన పుష్కర కాలంలో సుమారు 16 లక్షల మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రకటించింది. ఇందులో అత్యధికంగా గత ఏడాది 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ ఈ వివరాలను వెల్లడించారు. 2011 నుంచి 2022 వరకు గల వివరాలను కేంద్రం వెల్లడించింది.
2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది.. ఇక 2022లో 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ 12 ఏళ్లలో అత్యధికంగా 2022లో తమ పౌరసత్వాన్ని వదులుకోగా, అత్యల్పంగా 2020లో 85,256 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దీంతో మొత్తంగా 2011 నుంచి 2022 డిసెంబర్ ముగిసేనాటికి 16,63,440 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
ఒక నిర్దిష్ట ప్రశ్నకు కేంద్ర మంత్రి జయశంకర్ స్పందిస్తూ గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వాన్ని పొందారని వెల్లడించారు. అయితే భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు..మొత్తంగా 135 దేశాల్లో పౌరసత్వాన్ని పొందారు.ఆ వివరాలను కూడా కేంద్ర మంత్రి జయశంకర్ పార్లమెంటుకు అందించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









