టర్కీ, సిరియాలలో 17500 దాటిన మరణాలు.. మస్జీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
- February 09, 2023
యూఏఈ: దేశంలోని అన్ని మస్జీదుల్లో జుమా ప్రార్థనలు (శుక్రవారం ప్రార్థనలు) తర్వాత టర్కీ, సిరియాలో భూకంపాల బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు.మరో వైపు టర్కీ, సిరియాను తాకిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 17,500 దాటింది.టర్కీలో 14,351 మంది, సిరియాలో 3,162 మంది మరణించారని, మొత్తం 17,513కు చేరుకుందని అధికారులు, వైద్యులు తెలిపారు. భూకంపాల వల్ల నష్టపోయిన వారి సహాయానికి 100 మిలియన్ డాలర్లు అందించాలని షేక్ మహ్మద్ ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితులకు సహాయం చేయడానికి ఫీల్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడంతో పాటు బాధిత ప్రజలకు సహాయం చేయడానికి UAE ఇప్పటికే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లను కూడా పంపింది.ఇదిలా ఉండగా, అబుధాబిలోని టర్కీ రాయబార కార్యాలయం కూడా భూకంప విపత్తులో నష్టపోయిన వారి కోసం సహాయాన్ని సేకరించింది. విపత్తు బాధితులకు విరాళం ఇవ్వాలనుకునే UAE నివాసితులు రాయబార కార్యాలయంతో పాటు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్, టర్కిష్ రెడ్ క్రెసెంట్, యునిసెఫ్, ఇతరుల ద్వారా విరాళం ఇవ్వవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







