టర్కీ, సిరియాలలో 17500 దాటిన మరణాలు.. మస్జీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
- February 09, 2023
యూఏఈ: దేశంలోని అన్ని మస్జీదుల్లో జుమా ప్రార్థనలు (శుక్రవారం ప్రార్థనలు) తర్వాత టర్కీ, సిరియాలో భూకంపాల బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు.మరో వైపు టర్కీ, సిరియాను తాకిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 17,500 దాటింది.టర్కీలో 14,351 మంది, సిరియాలో 3,162 మంది మరణించారని, మొత్తం 17,513కు చేరుకుందని అధికారులు, వైద్యులు తెలిపారు. భూకంపాల వల్ల నష్టపోయిన వారి సహాయానికి 100 మిలియన్ డాలర్లు అందించాలని షేక్ మహ్మద్ ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితులకు సహాయం చేయడానికి ఫీల్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడంతో పాటు బాధిత ప్రజలకు సహాయం చేయడానికి UAE ఇప్పటికే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లను కూడా పంపింది.ఇదిలా ఉండగా, అబుధాబిలోని టర్కీ రాయబార కార్యాలయం కూడా భూకంప విపత్తులో నష్టపోయిన వారి కోసం సహాయాన్ని సేకరించింది. విపత్తు బాధితులకు విరాళం ఇవ్వాలనుకునే UAE నివాసితులు రాయబార కార్యాలయంతో పాటు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్, టర్కిష్ రెడ్ క్రెసెంట్, యునిసెఫ్, ఇతరుల ద్వారా విరాళం ఇవ్వవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







