టర్కీ, సిరియాలలో 17500 దాటిన మరణాలు.. మస్జీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
- February 09, 2023
యూఏఈ: దేశంలోని అన్ని మస్జీదుల్లో జుమా ప్రార్థనలు (శుక్రవారం ప్రార్థనలు) తర్వాత టర్కీ, సిరియాలో భూకంపాల బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు.మరో వైపు టర్కీ, సిరియాను తాకిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 17,500 దాటింది.టర్కీలో 14,351 మంది, సిరియాలో 3,162 మంది మరణించారని, మొత్తం 17,513కు చేరుకుందని అధికారులు, వైద్యులు తెలిపారు. భూకంపాల వల్ల నష్టపోయిన వారి సహాయానికి 100 మిలియన్ డాలర్లు అందించాలని షేక్ మహ్మద్ ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితులకు సహాయం చేయడానికి ఫీల్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడంతో పాటు బాధిత ప్రజలకు సహాయం చేయడానికి UAE ఇప్పటికే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లను కూడా పంపింది.ఇదిలా ఉండగా, అబుధాబిలోని టర్కీ రాయబార కార్యాలయం కూడా భూకంప విపత్తులో నష్టపోయిన వారి కోసం సహాయాన్ని సేకరించింది. విపత్తు బాధితులకు విరాళం ఇవ్వాలనుకునే UAE నివాసితులు రాయబార కార్యాలయంతో పాటు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్, టర్కిష్ రెడ్ క్రెసెంట్, యునిసెఫ్, ఇతరుల ద్వారా విరాళం ఇవ్వవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









