ప్రవాస కార్మికులకు ఆరోగ్యంపై KNPC అవగాహన ప్రచారం
- February 12, 2023
కువైట్: ఫహాహీల్ ఇండస్ట్రియల్ ఏరియాలో తమ ప్రవాస కార్మికుల కోసం ప్రాథమిక ఆరోగ్య అవగాహన ప్రచారాన్ని కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ(KNPC) నిర్వహించింది. “ఒకరినొకరు ఆరోగ్యంగా మార్చుకోవడానికి సహకరించుకుందాం” అనే థీమ్ కింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి KNPC సీఈఓ వధా అల్-ఖతీబ్, కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వైద్య అత్యవసర విభాగం డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్-షట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు ఆరోగ్యకర అలవాట్లు, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడంతో పాటు వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలను కన్సల్టెంట్లు, నిపుణుల ఆధ్వర్యంలో అందించారు. ఫహాహీల్, అహ్మదీ పారిశ్రామిక ప్రాంతాల కార్మికులను ఉద్దేశించి అల్-ఖతీబ్ మాట్లాడుతూ.. ఈ ప్రచారంతో సహా వైద్య అవగాహన కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం తన సామాజిక బాధ్యతగా నిర్వహించడానికి కంపెనీ ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటుందని చెప్పారు. కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







