ఆంధ్రప్రదేశ్ లో రూ.12000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌

- May 02, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ లో రూ.12000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌

అబుదాబికి చెందిన బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌ ఆంధ్రప్రదేశ్ లో రూ.12000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు నేడు ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబుతో బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌ అధినేత డీఆర్‌ శెట్టి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో   హెల్త్‌కేర్‌, పర్యాటక రంగాలలో పెట్టుబడులు పెట్టనున్న ఈ సంస్థ  డిసెంబర్ 2018 నాటికి ఏపీలో 3,500 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రులను నిర్మించనుంది. అమరావతి పరిధిలో ఒక  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పనుంది. రాష్ట్రంలో హెల్త్ టూరిజం అభివృద్ధికి సహకరించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com