విమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది..
- February 14, 2023
విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నిన్న ముంబైలో ముగిసిన నేపథ్యంలో బీసీసీఐ డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ ను ప్రకటించింది. మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచు గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. డబ్ల్యూపీఎల్ లో ఐదు జట్లు ఆడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడతాయి.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో మొత్తం 20 లీగ్ మ్యాచులు.. 2 ప్లే ఆఫ్ మ్యాచులు.. 23 రోజుల పాటు జరుగుతాయి. మార్చి 4న తొలి మ్యాచు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచు జరుగుతుంది.
అలాగే, డీవై పాటిల్ స్టేడియంలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మరో మ్యాచు జరుగుతుంది. కాగా, డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంలో మొత్తం 11 మ్యాచుల చొప్పున జరగనున్నాయి. మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచు మార్చి 26న ఉంటుంది. మార్చి 4న ప్రారంభమయ్యే మ్యాచులు మార్చి 26తో ముగుస్తాయి. వేలం పాటలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.

తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







