యూఏఈకి ధన్యవాదాలు తెలిపిన టర్కీ అధ్యక్షుడు
- February 14, 2023
యూఏఈ: భూకంపం తర్వాత తమ దేశానికి మద్దతుగా నిలిచినందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్.. యూఏఈ నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న ప్రపంచ ప్రభుత్వ సదస్సు(WGS) 2023లో టర్కీ అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఎర్డోగాన్ మాట్లాడుతున్న సమయంలో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అక్కడే ఉన్నారు.
దుబాయ్లో ఫిబ్రవరి 13న ప్రారంభమైన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ (WGS)లో వాతావరణ మార్పు, లింగ సమతౌల్యం, వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థ వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను ప్రభావితం చేసే అంశాలపై చర్చించడానికి ప్రపంచ నాయకులు, అధికారులు సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు( ఫిబ్రవరి 13 నుండి 15 వరకు) జరిగే ఈ సదస్సులో 150 కంటే ఎక్కువ దేశాల నుండి 20 మందికి పైగా దేశాల అధ్యక్షులు, 250 మంది ప్రభుత్వ , ప్రైవేట్ రంగ నాయకులు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







