యూఏఈకి ధన్యవాదాలు తెలిపిన టర్కీ అధ్యక్షుడు
- February 14, 2023
యూఏఈ: భూకంపం తర్వాత తమ దేశానికి మద్దతుగా నిలిచినందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్.. యూఏఈ నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న ప్రపంచ ప్రభుత్వ సదస్సు(WGS) 2023లో టర్కీ అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఎర్డోగాన్ మాట్లాడుతున్న సమయంలో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అక్కడే ఉన్నారు.
దుబాయ్లో ఫిబ్రవరి 13న ప్రారంభమైన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ (WGS)లో వాతావరణ మార్పు, లింగ సమతౌల్యం, వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థ వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను ప్రభావితం చేసే అంశాలపై చర్చించడానికి ప్రపంచ నాయకులు, అధికారులు సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు( ఫిబ్రవరి 13 నుండి 15 వరకు) జరిగే ఈ సదస్సులో 150 కంటే ఎక్కువ దేశాల నుండి 20 మందికి పైగా దేశాల అధ్యక్షులు, 250 మంది ప్రభుత్వ , ప్రైవేట్ రంగ నాయకులు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







