ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగుల్లో ఆందోళన..!
- February 17, 2023
బహ్రెయిన్: రోబోట్లు, ఆటోమేషన్ సిస్టమ్ల వినియోగానికి సంబంధించి మిడిల్ ఈస్ట్, టర్కీ మరియు ఆఫ్రికా ప్రాంతంలోని ఉద్యోగులలో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీని ఫలితంగా 55 శాతం మంది మెటా ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో ఉన్నారు. ఇటీవలి కాస్పెర్ స్కై (Kaspersky) పరిశోధన ప్రకారం.. ప్రతి ఐదుగురు ఉద్యోగులలో ఒకరు (22 శాతం) వారి కార్యాలయంలో బాట్లు లేదా ఆటోమేటెడ్ సిస్టమ్లతో కూడిన సైబర్ సెక్యూరిటీల గురించి ఆందోళన చెందుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారు ఆటోమేషన్, సంస్థలలో AI ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయని తెలిపారు. 62 శాతం మంది మాత్రం ప్రమాదకరమైన ఉద్యోగాల్లో రోబోట్ల వల్ల రిస్క్ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఇంకా సర్వేలో పాల్గొన్నవారిలో 37 శాతం మంది ఆటోమేషన్ ప్రమాదాల సంభావ్యతను తగ్గిస్తుందని నమ్ముతున్నారు. కాగా, 51 శాతం మంది రోబోలు ఉత్పత్తి ప్రక్రియల సామర్థ్యాన్ని పెంచగలవని, ఇది కంపెనీకి మొత్తం ఆర్థిక ప్రయోజనాలను పెంచుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ఉద్యోగాల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ, చాలా మంది ఉద్యోగులు రోబోటైజేషన్ ఉద్యోగులకు, కంపెనీకి అందించే ప్రయోజనాలను అర్థం చేసుకుంటారని పరిశోధనలు చెబుతున్నాయి.
ఫోర్బ్స్ ప్రకారం.. కంపెనీలు మునుపెన్నడూ లేనంత ప్రాధాన్యత డేటాకు కేటాయిస్తున్నాయి. కంపెనీలు సృష్టించిన, వినియోగించే డేటా మొత్తం 2010 - 2020 మధ్య 5000 శాతం పెరిగింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల సహాయంతో కంపెనీలు ఇప్పుడు వారి వ్యాపార నిర్ణయాలను మెరుగుపరచడంలో సహాయపడే వినియోగదారు డేటాను తెలుసుకోగల్గుతున్నాయి.
ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ జాసిమ్ హాజీ మాట్లాడుతూ.. మరిన్ని కంపెనీలు, సంస్థలు తమ వ్యూహాలలో AI వినియోగాన్ని పెంచడంతో మరింత వినూత్నమైన ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. అయితే, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (RPA), ప్రత్యేకంగా బ్యాక్-ఆఫీస్ ఫంక్షన్ల వంటి సాంకేతికతల కారణంగా చాలా ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. బ్యాంకింగ్ రంగం, చాట్బాక్స్, ఇటీవల చాట్జిపిటి, బుక్కీపింగ్, హోటళ్లలో హాస్పిటాలిటీ సేవలు మరియు ఏవియేషన్, ట్రైనింగ్ ప్రొవైడర్ల ఫలితంగా కాల్ సెంటర్లు, కస్టమర్ సేవలతో సహా AI వినియోగం ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలని డాక్టర్ హాజీ తెలిపారు. ఈ రంగాల్లో ఉన్న కంపెనీలు, సంస్థలు చాలా వరకు అవసరం లేదని ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేయవచ్చని తెలిపారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్ తమ ఉద్యోగులలో 70,000 మందిని తొలగించారని గుర్తుచేశారు.
కంప్యూటర్లు, ఇంటెలిజెంట్ మెషీన్లు, రోబోట్లు భవిష్యత్తులో వర్క్ఫోర్స్గా కనిపిస్తున్నాయని ఎలోన్ మస్క్ అంచనా వేశారని.. మరిన్ని ఉద్యోగాలు సాంకేతికతతో భర్తీ చేయబడతాయని డాక్టర్ జాసిమ్ వివరాంరు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ మంది వ్యక్తుల ఉద్యోగాలను AI సమర్థవంతంగా తీసుకోగలదని, రాబోయే దశాబ్దంలో 375 మిలియన్ల ఉద్యోగాలు మరుగున పడే అవకాశం ఉందని, AI 2030 నాటికి 97 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించగలదన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థకు $15.7 ట్రిలియన్ (BD 5.9 ట్రిలియన్) ఉత్పత్తిని పెంచగలదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







