యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్
- February 17, 2023
అమెరికా: భారత సంతతికి చెందిన వారు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన పలు సంస్థలకు అధిపతులుగా రానిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ పని చేస్తున్నాను. కాగా తాజాగా మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతికి చెందిన వ్యక్తి కీలక పదవిని పొందారు. ప్రముఖ సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్కు నీల్ మోహన్ అనే భారత సంతతి వ్యక్తి సీఈవోగా నియమితులయ్యారు. సంస్థకు అత్యధిక కాలం సీఈవోగా పని చేసిన సూసన్ వొజిసికి తాజాగా పదవి నుంచి వైదొగడంతో మోహన్ను కొత్త సీఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
నీల్ మోహన్ ఇండియన్-అమెరికన్. సీఈవోగా బాధ్యతలు చేపట్టే వరకు యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా పని చేశారు. నీల్ మోహన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2008లో ఆయన గూగుల్ సంస్థలో చేరారు. భారతీయులకు టాప్ కంపెనీల్లో అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం. యూట్యూబ్ నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న నీల్మోహన్కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు. సుసాన్ వొజిసికి సంస్థకు చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన యూట్యూబ్ను అత్యంత విజయవంతంగా ముందుకు నడిపించారని ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







