పవన్ కల్యాణ్ ఆదుకున్న చిన్నారి రేవతి కన్నుమూత..
- February 17, 2023హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదుకున్న రేవంతి తుదిశ్వాస విడిచింది. నాలుగేళ్ల క్రితం విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఓ నిరుపేద కుటుంబం కలిసి తమ కుమార్తె రేవతి ఆరోగ్యం బాలేదని.. కండరాల వ్యాధితో బాధపడుతుందని తమకు ఏదైనా సహాయం చేయాలంటూ పవన్ ను అభ్యర్థించారు. చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్.. ఆమెకు ఆర్థిక సాయంతో పాటు ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ చిన్నారిని మైసూర్ లోని ఆశ్రమంలో చేర్పించారు. చిన్నారి కోలుకుంటుంది.. సంతోషంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు శోకసంద్రం మిగిలింది. ఈరోజు రేవతి కన్నుమూసింది.
గత కొద్దీ రోజులుగా రేవతి మైసూరు ఆశ్రమంలో ఉంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటుంది. కానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. చివరికి ఈరోజు కన్నుమూసింది. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఎంతో బాధపడ్డారు. రేవతికి పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం. ఓ చిన్నారి ఇలా బాధపడుతోందని తెలియగానే పవన్ ఆ కుటుంబాన్ని కలిశారు. రేవతిని ఒడిలో కూర్చొబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ చిన్నారి లేదని తెలిసి యావత్ ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ రేవతి కుటుంబ సభ్యులకు ధైర్యం చెపుతున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి