పవన్ కల్యాణ్ ఆదుకున్న చిన్నారి రేవతి కన్నుమూత..
- February 17, 2023
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదుకున్న రేవంతి తుదిశ్వాస విడిచింది. నాలుగేళ్ల క్రితం విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఓ నిరుపేద కుటుంబం కలిసి తమ కుమార్తె రేవతి ఆరోగ్యం బాలేదని.. కండరాల వ్యాధితో బాధపడుతుందని తమకు ఏదైనా సహాయం చేయాలంటూ పవన్ ను అభ్యర్థించారు. చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్.. ఆమెకు ఆర్థిక సాయంతో పాటు ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ చిన్నారిని మైసూర్ లోని ఆశ్రమంలో చేర్పించారు. చిన్నారి కోలుకుంటుంది.. సంతోషంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు శోకసంద్రం మిగిలింది. ఈరోజు రేవతి కన్నుమూసింది.
గత కొద్దీ రోజులుగా రేవతి మైసూరు ఆశ్రమంలో ఉంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటుంది. కానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. చివరికి ఈరోజు కన్నుమూసింది. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఎంతో బాధపడ్డారు. రేవతికి పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం. ఓ చిన్నారి ఇలా బాధపడుతోందని తెలియగానే పవన్ ఆ కుటుంబాన్ని కలిశారు. రేవతిని ఒడిలో కూర్చొబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ చిన్నారి లేదని తెలిసి యావత్ ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ రేవతి కుటుంబ సభ్యులకు ధైర్యం చెపుతున్నారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









