అజ్మాన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురుకి తీవ్ర గాయాలు
- February 18, 2023
యూఏఈ: శుక్రవారం ఉదయం అజ్మాన్లోని ఓ లూబ్రికెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. దుబాయ్, షార్జా మరియు ఉమ్ అల్ క్వైన్తో సహా నాలుగు ఎమిరేట్లకు చెందిన సివిల్ డిఫెన్స్ బృందాలు ఏడు నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చాయి. అత్యవసర ప్రతిస్పందన బృందాలు చుట్టుపక్కల ప్రాంతాల నివాసితులను ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ, ప్రింటింగ్ ప్రెస్, రెడీమేడ్ బట్టల గోదాము, తొమ్మిది వాణిజ్య దుకాణాలు దగ్ధమైనట్లు అజ్మాన్ అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీ పక్కన పార్క్ చేసిన 39 కార్లు దగ్ధం అయినట్లు అధికారులు తెలిపారు.
అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి మాట్లాడుతూ.. ఎమిరేట్స్ న్యూ ఇండస్ట్రియల్ ఏరియాలో తెల్లవారుజామున 3.15 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం అందిందని చెప్పారు. మంటల స్థాయిని పరిగణనలోకి తీసుకుని పొరుగున ఉన్న ఎమిరేట్స్ దుబాయ్, షార్జా, ఉమ్ అల్ క్వైన్ మరియు అజ్మాన్లలోని అగ్నిమాపక కేంద్రాల నుండి సహాయాన్ని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. యూనియన్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కంపెనీ, మున్సిపాలిటీ మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్, రెడ్ క్రెసెంట్ కూడా అత్యవసర ప్రతిస్పందన బృందాలను పంపాయని తెలిపారు.
మరోపక్క ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో శీతలీకరణ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ రేద్ ఒబైద్ అల్ జాబీ తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్న ఉన్నత అధికారులలో కమాండర్-ఇన్-చీఫ్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, మేజర్-జనరల్ డాక్టర్ జాసిమ్ ముహమ్మద్ అల్ మర్జౌకి సమీక్షించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







