2023లో జీతాలు పెరుగుతాయని నమ్మకంతోఉన్న 70 శాతం ఉద్యోగులు!
- February 18, 2023
యూఏఈ: యూఏఈలో 10 మంది ఉద్యోగుల్లో ఏడుగురు 2023లో ఉద్యోగాలు మారడం ద్వారా వేతనాలు పెరుగుతాయనే నమ్మకంతో ఉన్నారని ఒక అధ్యయనం తెలిపింది. చాలా మంది కార్మికులు తమకు చివరిగా ఒకటి నుండి రెండు సంవత్సరాల క్రితం జీతం పెంచారని చెప్పగా.. 15 శాతం మంది తమ జీతం పెరిగి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం అయిందని తెలిపారు. టైగర్ రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయబడిన ఈ నివేదికలో.. కార్మికులు తమ ప్రస్తుత యజమానితో పెంపుపై చర్చలు జరపడం కంటే 2023లో మెరుగైన వేతనంతో కూడిన కొత్త ఉద్యోగం కోసం వెతకడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.
యూఏఈలో 10 - 38 శాతం మందిలో దాదాపు నలుగురు ఉద్యోగులు తమకు కావలసిన పే చెక్ కోసం తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరంలో దాదాపు సగం మంది - 43 శాతం మంది తమ అధికారులతో ఇప్పటికే ఈ విషయం గురించి చర్చించారు. కేవలం 23 శాతం మంది మాత్రమే ఉద్యోగ భద్రత కోసం తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని, కేవలం 15 శాతం మంది మాత్రమే తమ ప్రస్తుత యజమానితో వేతనాల పెంపుపై చర్చలు జరపాలని యోచిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







