2023లో జీతాలు పెరుగుతాయని నమ్మకంతోఉన్న 70 శాతం ఉద్యోగులు!
- February 18, 2023
యూఏఈ: యూఏఈలో 10 మంది ఉద్యోగుల్లో ఏడుగురు 2023లో ఉద్యోగాలు మారడం ద్వారా వేతనాలు పెరుగుతాయనే నమ్మకంతో ఉన్నారని ఒక అధ్యయనం తెలిపింది. చాలా మంది కార్మికులు తమకు చివరిగా ఒకటి నుండి రెండు సంవత్సరాల క్రితం జీతం పెంచారని చెప్పగా.. 15 శాతం మంది తమ జీతం పెరిగి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం అయిందని తెలిపారు. టైగర్ రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయబడిన ఈ నివేదికలో.. కార్మికులు తమ ప్రస్తుత యజమానితో పెంపుపై చర్చలు జరపడం కంటే 2023లో మెరుగైన వేతనంతో కూడిన కొత్త ఉద్యోగం కోసం వెతకడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.
యూఏఈలో 10 - 38 శాతం మందిలో దాదాపు నలుగురు ఉద్యోగులు తమకు కావలసిన పే చెక్ కోసం తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరంలో దాదాపు సగం మంది - 43 శాతం మంది తమ అధికారులతో ఇప్పటికే ఈ విషయం గురించి చర్చించారు. కేవలం 23 శాతం మంది మాత్రమే ఉద్యోగ భద్రత కోసం తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని, కేవలం 15 శాతం మంది మాత్రమే తమ ప్రస్తుత యజమానితో వేతనాల పెంపుపై చర్చలు జరపాలని యోచిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







