2023లో జీతాలు పెరుగుతాయని నమ్మకంతోఉన్న 70 శాతం ఉద్యోగులు!
- February 18, 2023యూఏఈ: యూఏఈలో 10 మంది ఉద్యోగుల్లో ఏడుగురు 2023లో ఉద్యోగాలు మారడం ద్వారా వేతనాలు పెరుగుతాయనే నమ్మకంతో ఉన్నారని ఒక అధ్యయనం తెలిపింది. చాలా మంది కార్మికులు తమకు చివరిగా ఒకటి నుండి రెండు సంవత్సరాల క్రితం జీతం పెంచారని చెప్పగా.. 15 శాతం మంది తమ జీతం పెరిగి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం అయిందని తెలిపారు. టైగర్ రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయబడిన ఈ నివేదికలో.. కార్మికులు తమ ప్రస్తుత యజమానితో పెంపుపై చర్చలు జరపడం కంటే 2023లో మెరుగైన వేతనంతో కూడిన కొత్త ఉద్యోగం కోసం వెతకడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.
యూఏఈలో 10 - 38 శాతం మందిలో దాదాపు నలుగురు ఉద్యోగులు తమకు కావలసిన పే చెక్ కోసం తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరంలో దాదాపు సగం మంది - 43 శాతం మంది తమ అధికారులతో ఇప్పటికే ఈ విషయం గురించి చర్చించారు. కేవలం 23 శాతం మంది మాత్రమే ఉద్యోగ భద్రత కోసం తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని, కేవలం 15 శాతం మంది మాత్రమే తమ ప్రస్తుత యజమానితో వేతనాల పెంపుపై చర్చలు జరపాలని యోచిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..