500 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో సంస్థ
- February 18, 2023
టాటా సంస్థకు చెందిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ భారీ స్థాయిలో విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి ఎయిర్ ఇండియా 470 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
తాజాగా మరో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కూడా భారీ సంఖ్యలో విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 500 కొత్త విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ బస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే టర్కీ ఎయిర్లైన్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇండిగో ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా వెల్లడించారు. దీని ద్వారా ఇండియా నుంచి యూరప్, ఇస్తాంబుల్ వంటి నగరాలకు విమానాల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుందన్నారు.
ఇండిగో సంస్థ యూరప్కు చెందిన ఎయిర్ బస్ సంస్థ నుంచి విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 2030 వరకు వీలైనన్ని విమానాలు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఇండిగో సంస్థకు 300 విమానాలున్నాయి. ఇప్పుడు 500 విమానాల్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, విమానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచే సేవల విస్తరణ మొదలవుతుందని వినయ్ మల్హోత్రా అన్నారు. విమానాల లభ్యతను బట్టి దేశంలోని నగరాలతోపాటు, అంతర్జాతీయంగానూ విమానాలు నడుపుతారు.
ఇండిగో సంస్థకు చెందిన విమానాలు రోజూ 1800 ప్రయాణాలు చేస్తున్నాయి. వీటిలో 10 శాతం అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం టర్కీ, ఇస్తాంబుల్తోపాటు యూరప్లోని అనేక నగరాలకు విమానాలు నడుపుతున్నామని, త్వరలోనే కెన్యా, ఇండోనేషియాలకు కూడా విమానాలు నడుపుతామని వినయ్ చెప్పారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







