టర్కీ-సిరియా భూకంపం: 45 వేలు దాటిన మృతుల సంఖ్య
- February 18, 2023
యూఏఈ: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 45 వేలు దాటింది. టర్కీలోనే దాదాపు 264,000 అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి. టర్కీలో మరణాల సంఖ్య 39,672 కాగా, పొరుగున ఉన్న సిరియాలో 5,800 మందికి పైగా మరణించారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మస్జీదులలో టర్కీ, సిరియాలో చనిపోయిన వారి కోసం అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు విపత్తు తర్వాత సిరియాలో మళ్లీ ఘర్షణలు జరిగాయి. ప్రభుత్వ బలగాలు భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న తిరుగుబాటుదారుల ఆధీనంలోని పట్టణమైన అటారెబ్ శివార్లలో షెల్లింగ్ చేశాయని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శుక్రవారం వెల్లడించింది. శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ గడ్డ కట్టే వాతావరణం కారణంగా .. సహాయక చర్యలు అతికష్టంగా సాగుతున్నాయి. మరోవైపు భూకంపం సంభవించి 12 రోజులు గడవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టంగా మారింది. అయితే, కొందరు మాత్రం ఇంకా సురక్షితంగా బయటపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు 200 ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు టర్కీ ఉపాధ్యక్షుడు ఫువాట్ ఓకటే తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







