టర్కీ-సిరియా భూకంపం: 45 వేలు దాటిన మృతుల సంఖ్య
- February 18, 2023
యూఏఈ: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 45 వేలు దాటింది. టర్కీలోనే దాదాపు 264,000 అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి. టర్కీలో మరణాల సంఖ్య 39,672 కాగా, పొరుగున ఉన్న సిరియాలో 5,800 మందికి పైగా మరణించారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మస్జీదులలో టర్కీ, సిరియాలో చనిపోయిన వారి కోసం అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు విపత్తు తర్వాత సిరియాలో మళ్లీ ఘర్షణలు జరిగాయి. ప్రభుత్వ బలగాలు భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న తిరుగుబాటుదారుల ఆధీనంలోని పట్టణమైన అటారెబ్ శివార్లలో షెల్లింగ్ చేశాయని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శుక్రవారం వెల్లడించింది. శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ గడ్డ కట్టే వాతావరణం కారణంగా .. సహాయక చర్యలు అతికష్టంగా సాగుతున్నాయి. మరోవైపు భూకంపం సంభవించి 12 రోజులు గడవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టంగా మారింది. అయితే, కొందరు మాత్రం ఇంకా సురక్షితంగా బయటపడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు 200 ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు టర్కీ ఉపాధ్యక్షుడు ఫువాట్ ఓకటే తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







