ఒక్క రోజులో $3.7 మిలియన్లు సేకరణ
- February 18, 2023
బహ్రెయిన్: సిరియా, టర్కీని వణికించిన భూకంపం బాధితుల కోసం తక్షణ మానవతా సహాయం కోసం బహ్రెయిన్ తన జాతీయ ప్రచారం కింద $3.7 మిలియన్ (BD1.38 మిలియన్) కంటే ఎక్కువ సేకరించినట్లు రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) ప్రకటించింది. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాల మేరకు బహ్రెయిన్ టీవీ RHF సహకారంతో "సాలిడారిటీ డే"ని నిర్వహించింది. హిస్ మెజెస్టి కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ ప్రతినిధి హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయ పిలుపు మేరకు బహ్రెయిన్లు, నివాసితులు, జాతీయ సంస్థలు,కంపెనీలు, బ్యాంకులు, సొసైటీలు, ఇతర సామాజిక భాగాలు బహ్రెయిన్ TVలో ప్రసారమైన విరాళ టెలిథాన్కు విశేషంగా స్పందించారు. ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. భూకంప బాధితుల కోసం క్యాంపెయి ఇంకా కొనసాగుతోందని, ఆర్హెచ్ఎఫ్ ఛానెల్ల ద్వారా విరాళాలు అందజేయవచ్చిన ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







