వచ్చే ఏడాది అబుధాబిలో ఐఐటీ క్యాంపస్
- February 18, 2023
యూఏఈ: భారతదేశ ప్రఖ్యాత కళాశాల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) వచ్చే ఏడాది అబుధాబిలో తన మొదటి విదేశీ క్యాంపస్ను ప్రారంభించనుంది. ఈ మేరకు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. గతేడాది నవంబర్లో IIT ఢిల్లీకి చెందిన ఉన్నత స్థాయి బృందం యూఏఈ రాజధాని పర్యటనను సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ అబుధాబి (ADEK) అధికారులతో దీని గురించి విస్తృతంగా చర్చలు జరిపింది. ప్రస్తుతం భారతదేశంలో 23 IITలు ఉన్నాయి. ఇవి దేశంలోని వివిధ ప్రాంతాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరేట్ స్థాయి కార్యక్రమాలను అందిస్తున్నాయి. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, భారతీయ పారిశ్రామికవేత్త NR నారాయణ మూర్తి వంటి ఎందరో ప్రముఖులు ఐఐటీలలోనే చదువుకున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









