ఏపీ, తెలంగాణకు జీఎస్టీ పరిహారం విడుదల
- February 18, 2023
న్యూ ఢిల్లీ: ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు క్లియర్ చేసింది కేంద్రం. GST పరిహారం పెండింగ్ మొత్తం బకాయిలు ఈరోజు నుండి క్లియర్ చేయబడతాయని సమావేశంలో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. GST పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ జూన్ వరకు మొత్తం రూ. 16,982 కోట్లు క్లియర్ చేసినట్లు మంత్రి నిర్మల చెప్పారు.
ఈరోజు నాటికి ఈ మొత్తం నిధులు.. పరిహార నిధిలో అందుబాటులో లేనప్పటికీ సొంత వనరుల నుండి విడుదల చేయాలని నిర్ణయించిట్లు వెల్లడించారు. జీఎస్టీ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.1,265 కోట్లు విడుదల చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఢిల్లీలో 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ చట్టం-2017కి లోబడి ఐదేళ్ల కాలవ్యవధికి సంబంధించిన అన్ని బకాయిలు చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు మంత్రి నిర్మల. జీఎస్టీ పరిహారాలకు సంబంధించి ఇప్పటివరకున్న అన్ని బకాయిలను రాష్ట్రాలకు చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
జూన్ మాసానికి సంబంధించిన రూ.16,982 కోట్లను కూడా చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఈ చెల్లింపులకు అవసరమైన నిధులు ప్రస్తుతం అందుబాటులో లేవన్న ఆమె.. కేంద్రం సొంత ఆర్థిక వనరుల నుంచి ఈ చెల్లింపులు చేస్తామని వివరించారు. ఇప్పుడు విడుదల చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో పరిహార రుసుం వసూళ్ల నుంచి మినహాయించుకుంటామని నిర్మల చెప్పారు. మరోవైపు స్టేషనరీపై జీఎస్టీని 18 నుంచి 12శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







