మహాశివరాత్రి.. భక్తులతో కిటకిటలాడిన దుబాయ్ హిందూ దేవాలయం
- February 18, 2023
దుబాయ్: దుబాయ్ లో జెబెల్ అలీ లోని హిందూ దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. ఓం నమ:శివాయా అంటూ ఆలయం మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి శివుడుని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దుబాయ్ హిందూ దేవాలయం జనరల్ మేనేజర్ ఎన్. మోహన్ మాట్లాడుతూ.. తెల్లవారు జామున 4.30 నుంచే భక్తుల కోసం ఆలయాన్ని తెరిచామని తెలిపారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి శివరాత్రి రోజున దాదాపు 30-35 వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారని, శివరాత్రి మరునాడు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఆలయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్న మోహన్.. బ్యాచిలర్లు, పిల్లల తల్లులకు, ఫ్యామీలకు, వృద్ధులకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేశామన్నారు.కొత్త సంవత్సరం జనవరి 1ని పురస్కరించుకొని 25 వేలకంటే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, ఆ అనుభవంతో ఇప్పుడు వేలాది భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ జనరల్ మేనేజర్ వెల్లడించారు. శివరాత్రి సందర్భంగా అందరికీ మంచి జరగాలని శుభాకాంక్షలు తెలిపారు.




తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







