మహాశివరాత్రి.. భక్తులతో కిటకిటలాడిన దుబాయ్ హిందూ దేవాలయం
- February 18, 2023
దుబాయ్: దుబాయ్ లో జెబెల్ అలీ లోని హిందూ దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. ఓం నమ:శివాయా అంటూ ఆలయం మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి శివుడుని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దుబాయ్ హిందూ దేవాలయం జనరల్ మేనేజర్ ఎన్. మోహన్ మాట్లాడుతూ.. తెల్లవారు జామున 4.30 నుంచే భక్తుల కోసం ఆలయాన్ని తెరిచామని తెలిపారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి శివరాత్రి రోజున దాదాపు 30-35 వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారని, శివరాత్రి మరునాడు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఆలయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్న మోహన్.. బ్యాచిలర్లు, పిల్లల తల్లులకు, ఫ్యామీలకు, వృద్ధులకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేశామన్నారు.కొత్త సంవత్సరం జనవరి 1ని పురస్కరించుకొని 25 వేలకంటే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, ఆ అనుభవంతో ఇప్పుడు వేలాది భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ జనరల్ మేనేజర్ వెల్లడించారు. శివరాత్రి సందర్భంగా అందరికీ మంచి జరగాలని శుభాకాంక్షలు తెలిపారు.




తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







