బహ్రెయిన్ సంచలన నిర్ణయం..
- February 19, 2023
మనామా: బహ్రెయిన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పాశ్చరైజ్ చేయని పాలు ),దాని సంబంధిత ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించింది.ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో దుకాణదారులకు కీలక సూచనలు చేసింది. పాశ్చరైజ్ చేయని పాలు, ఆ పాలతో తయారు చేసే ఉత్పత్తులను ఎట్టిపరిస్థితులలో విక్రయించకూడదని స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లైసెన్స్ పొందిన పాల కేంద్రాల నుంచి పొందిన పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని తన ప్రకటనలో పేర్కొంది.
ఇక పాశ్చరైజ్ పాలలో సూక్ష్మజీవులను తొలగించడానికి తగిన ప్రాసెస్ ఉంటుంది.అలాగే మంచి ప్యాకింగ్ కూడా లభిస్తుంది. అలాంటి పాల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. నాణ్యతలేని, కలుషితమైన పాలను వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడతారని అధికారులు తెలిపారు. 'పాలు చాలా త్వరగా పాడైపోయే ఆహారం. అదే సమయంలో కలుషితం అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. నాణ్యతలేని పాల ఉత్పత్తులను ఎట్టిపరిస్థితులలో విక్రయించవద్దు' అని ఆరోగ్యశాఖ చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







