బహ్రెయిన్ సంచలన నిర్ణయం..
- February 19, 2023
మనామా: బహ్రెయిన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పాశ్చరైజ్ చేయని పాలు ),దాని సంబంధిత ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించింది.ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో దుకాణదారులకు కీలక సూచనలు చేసింది. పాశ్చరైజ్ చేయని పాలు, ఆ పాలతో తయారు చేసే ఉత్పత్తులను ఎట్టిపరిస్థితులలో విక్రయించకూడదని స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లైసెన్స్ పొందిన పాల కేంద్రాల నుంచి పొందిన పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని తన ప్రకటనలో పేర్కొంది.
ఇక పాశ్చరైజ్ పాలలో సూక్ష్మజీవులను తొలగించడానికి తగిన ప్రాసెస్ ఉంటుంది.అలాగే మంచి ప్యాకింగ్ కూడా లభిస్తుంది. అలాంటి పాల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. నాణ్యతలేని, కలుషితమైన పాలను వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడతారని అధికారులు తెలిపారు. 'పాలు చాలా త్వరగా పాడైపోయే ఆహారం. అదే సమయంలో కలుషితం అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. నాణ్యతలేని పాల ఉత్పత్తులను ఎట్టిపరిస్థితులలో విక్రయించవద్దు' అని ఆరోగ్యశాఖ చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







