ఏపీలో పలుచోట్ల భూప్రకంపనలు
- February 19, 2023
అమరావతి: ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. పల్నాడు అచ్చం పేట మండలంలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లిలో భూమి స్వల్పంగా కపించింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీర్ల పాడు మండలాల్లో భూకంపం ఏర్పడింది.
ఆదివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు.. ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు పెట్టారు. అటు పులించింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భూకంపాలు పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. రీసెంట్ గా టర్కీ, సిరియా దేశాల్లో వరుస భూకంపాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే సుమారు 40 వేల మంది చనిపోయారు. ఇటీవల కాలంలో జరిగిన ప్రకృతి అతి పెద్దదిగా చెబుతున్న ఈ భూకంపం ధాటికి ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







