ఏపీలో పలుచోట్ల భూప్రకంపనలు
- February 19, 2023
అమరావతి: ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. పల్నాడు అచ్చం పేట మండలంలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లిలో భూమి స్వల్పంగా కపించింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీర్ల పాడు మండలాల్లో భూకంపం ఏర్పడింది.
ఆదివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు.. ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు పెట్టారు. అటు పులించింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భూకంపాలు పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. రీసెంట్ గా టర్కీ, సిరియా దేశాల్లో వరుస భూకంపాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే సుమారు 40 వేల మంది చనిపోయారు. ఇటీవల కాలంలో జరిగిన ప్రకృతి అతి పెద్దదిగా చెబుతున్న ఈ భూకంపం ధాటికి ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







