సేవల్లో నిర్లక్ష్యం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ఉద్యోగులు రిఫర్

- February 20, 2023 , by Maagulf
సేవల్లో నిర్లక్ష్యం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ఉద్యోగులు రిఫర్

మస్కట్: 2023 సంవత్సరానికి సంబంధించి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని కారణంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు కువైట్ గృహనిర్మాణం, పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ (MoHUP) వెల్లడించింది. ఇఫ్సా (బహిర్గతం) చొరవలో భాగంగా గత సంవత్సరంలో తమకు 91 నివేదికలు అందాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో29 నివేదికలను అంతర్గత కమిటీ పరిష్కరించినట్లు, మిగతా వాటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు వెల్లడించింది. సేవలు అందించడంలో నిర్లక్ష్యం, సర్వీస్ రూల్స్ అతిక్రమించడం వంటి వాటిని ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com