ఇద్దరు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భారతీయ మహిళ
- February 21, 2023
కువైట్: ఓ భారతీయ మహిళ ఫిబ్రవరి 19న తన ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కువైట్ లోని ఫహాహీల్లో జరిగింది. మృతురాలిని తమిళనాడుకు చెందిన అఖిలా కార్తీగా గుర్తించారు. ఫహాహీల్లోని తమ అపార్టుమెంట్ ఆరో అంతస్తు నుంచి దూకే ముందు ఆమె తన ఇద్దరు పిల్లలను(10 సంవత్సరాల కుమారుడు, 12 సంవత్సరాల కుమార్తె) ఊపిరాడక చంపేసిందని పోలీసులు తెలిపారు. ఆమె డిప్రెషన్తో బాధపడుతూ చికిత్స పొందుతోందని గుర్తించారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉండటం, ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులు డోర్లను బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో పిల్లలిద్దరూ శవమై పడి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న అఖిలా కార్తీ, ఆమె భర్త ఇద్దరూ ఇంజనీర్లు. తమిళ అసోసియేషన్ కువైట్లో అఖిలా కార్తీ క్రియాశీల సభ్యురాలని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









