ఇద్దరు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భారతీయ మహిళ
- February 21, 2023
కువైట్: ఓ భారతీయ మహిళ ఫిబ్రవరి 19న తన ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కువైట్ లోని ఫహాహీల్లో జరిగింది. మృతురాలిని తమిళనాడుకు చెందిన అఖిలా కార్తీగా గుర్తించారు. ఫహాహీల్లోని తమ అపార్టుమెంట్ ఆరో అంతస్తు నుంచి దూకే ముందు ఆమె తన ఇద్దరు పిల్లలను(10 సంవత్సరాల కుమారుడు, 12 సంవత్సరాల కుమార్తె) ఊపిరాడక చంపేసిందని పోలీసులు తెలిపారు. ఆమె డిప్రెషన్తో బాధపడుతూ చికిత్స పొందుతోందని గుర్తించారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉండటం, ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులు డోర్లను బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో పిల్లలిద్దరూ శవమై పడి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న అఖిలా కార్తీ, ఆమె భర్త ఇద్దరూ ఇంజనీర్లు. తమిళ అసోసియేషన్ కువైట్లో అఖిలా కార్తీ క్రియాశీల సభ్యురాలని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







