బహ్రెయిన్ లో ‘MEOS GEO 2023’ ప్రారంభం
- February 21, 2023
బహ్రెయిన్: సఖిర్లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ సెంటర్లో మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ఫర్ ఆయిల్, గ్యాస్ అండ్ జియోసైన్సెస్ (MEOS GEO 2023) ప్రారంభమైంది. హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తరపున క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి, ఉప ప్రధాని షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలోని సమగ్ర అభివృద్ధి పథంలో చమురు, గ్యాస్ రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అబ్దుల్లా అల్ ఖలీఫా వెల్లడించారు. 1979 నుండి ప్రతి రెండు సంవత్సరాలకు బహ్రెయిన్ రాజ్యంలో ఈ ఈవెంట్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్, గ్యాస్ రంగాల అభివృద్ధికి నోగాహోల్డింగ్ చైర్మన్, హ్యూమైటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ కోసం HM కింగ్ ప్రతినిధి, హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని ఆయిల్ అండ్ గ్యాస్ హోల్డింగ్ కంపెనీ (నోగాహోల్డింగ్) కృషిని ఆయన ప్రశంసించారు. 15,000 మందికి పైగా సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, నిపుణులు, విద్యావేత్తల భాగస్వామ్యంతో “నేటి వాస్తవాలు... రేపటి శక్తి” అనే నినాదంతో ఈ సంవత్సరం ఈ సదస్సు జరుగుతుంది. చమురు, గ్యాస్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను చర్చించి, పరిష్కారాలను అన్వేషించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







