సివరాఖరికి శివగామికే ఫిక్సయిపోయిన త్రివిక్రముడు.!
- February 27, 2023
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జెట్ స్పీడులో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి మహేష్ బాబు ఇంట వరుస విషాదాలతో బ్రేకులు పడిన సంగతి తెలిసిందే.
ఈ మధ్యనే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది. అలాగే, త్రివిక్రమ్ సినిమాల్లో సహజంగానే ఓ సీనియర్ లేడీ పాత్రకు అత్యధిక ప్రాధాన్యత వుంటుంది. అలా ఈ సినిమాలోనూ ఓ సీనియర్ లేడీ పవర్ ఫుల్ వుండనే వుంది.
ఆ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి పలువురు సీనియర్ నటీమణుల పేర్లు వినిపించగా.. చివరికి టాలీవుడ్ డేరింగ్ లేడీ రమ్యకృష్ణ వద్దే త్రివిక్రమ్ బండి ఆగిపోయింది. ఎంతైనా శివగామికి మించిన వాళ్లుంటారా చెప్పండి.! త్వరలో జరగబోయే షెడ్యూల్లో రమ్యకృష్ణ పాల్గొనబోతోందనీ సమాచారం.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!









