ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండండి
- February 28, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో ఎండాకాలం మొదలవ్వబోతుంది.ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.మార్చి 1 నుంచి ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ ( NPCCHH)’ కింద ‘ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ (IHIP)’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా వాతావరణ మార్పులు, ఎండ వేడిమి వల్ల తలెత్తే అంశాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా నమోదయ్యే స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దీంతో ఈ ఏడాది అధికంగా ఎండలు మండే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు ఎండల ద్వారా తలెత్తే అనారోగ్యం విషయంలో, వైద్య సేవలు అందించేదుకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.సంబంధిత ఫార్మాట్ ప్రకారం..రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇందుకు అవసరమైన వైద్య సేవలు, చికిత్సలు, రోగులు, అనారోగ్య సమస్యలు వంటి వివరాల్ని పొందు పర్చి కేంద్రానికి అందించాలని ఆదేశించారు.దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఎండ వేడిమి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనేందుకు అనుగుణంగా వైద్య సిబ్బందికి అవగాహన కల్పించడం, వైద్య సదుపాయాలు మెరుగుపర్చుకోవడం వంటివి చేయాలని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







